Home / Chhattisgarh
: చత్తీస్గఢ్ మరోమారు రక్తమోడింది. తాజాగా మంగళవారం నాడు చత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు .. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా నక్సల్స్ఏరివేత కార్యక్రమంలో జిల్లా రిజర్వ్ గార్డ్లు, స్పెషల్ టాక్స్ ఫోర్స్లు పాల్గొన్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందన్నారు.
ఛత్తీస్గఢ్లోని బెమెతారా జిల్లాలో ప్రయాణీకులతో ఉన్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు తిరయ్య గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ చెప్పారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జైలు సమీపంలోని భన్సీలో సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు నిర్మాణ సంస్థకు చెందిన 16 వాహనాలకు నిప్పు పెట్టారు.దంతేవాడ నుండి బైలదిల్లా రోడ్డు వరకు విస్తరించేందుకు కంపెనీ భాన్సీలోని బెంగాలీ క్యాంపు సమీపంలో క్యాంపును ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి వాహనాలకు నిప్పు పెట్టారు.
మిజోరం, ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
కాంగ్రెస్కు అవినీతి అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, తాను అవినీతిపై చర్యలకు గ్యారెంటీ అని మోదీ అన్నారు.శుక్రవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని అన్నారు.
నీట్ ఎగ్జామ్ ద్వారా MBBS కోర్సుల్లో ప్రవేశాలకు పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. అయితే ఎక్కువ ర్యాంకు వచ్చి ఏపీ, తెలంగాణలో 'B' కేటగిరీ సీట్లకు ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్దులకు ప్రత్యమ్నాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ .
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
తన ఖరీదైన ఫోన్ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుండి 42 లక్షల లీటర్ల నీటిని తోడించినందుకు ఛత్తీస్గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల వరకు నీటిని తోడివేసేందుకు మౌఖిక అనుమతి ఇచ్చారని ఇన్స్పెక్టర్ పేర్కొన్న సీనియర్ అధికారిని బాధ్యులను చేశారు.
ఛత్తీస్గఢ్లోని సుక్మాలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.