Published On:

IPL 2025 : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత ఎఫెక్ట్.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

IPL 2025 : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత ఎఫెక్ట్.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

IPL 2025  :  ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం కాకముందే నిలిపోయింది. జమ్మూకశ్మీర్‌, పఠాన్‌కోఠ్‌లో పాక్ డ్రోన్‌, వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ అవుట్‌ కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్‌ను కొనసాగించలేమన్న బీసీసీఐ రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయింది. ప్రేక్షకులు, ఆటగాళ్లను మైదానం బయటకు తీసుకువచ్చింది. సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. ధర్మశాల నుంచి క్రికెటర్లతోపాటు సిబ్బంది, బ్రాడ్‌క్యాస్టింగ్‌ సిబ్బందిని తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా రైలును పంపింది.

 

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్‌ను నిర్వహించడం మంచిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ క్రమంలో లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు జాతీయ మీడియాకు వివరించారు. ఐపీఎల్‌లో గురువారం నాటికి 58 మ్యాచులు జరిగాయి. శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌–బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

 

ఫైనల్‌తో పాటు మొత్తం 74 మ్యాచులు జరుగాల్సి ఉంది. ప్రస్తుతం టోర్నీ చివరి దశలో ఉన్నది. ఫైనల్‌తోపాటు మొత్తం 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, ఫైనల్ మ్యాచ్ ఈ నెల 25న కోల్‌కతాలో జరగాల్సింది. ఐపీఎల్ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ గురువారం ఐపీఎల్‌ 18వ సీజన్‌ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి: