Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చేతగాని బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ని గెలిపించాలని ఎంఐఎం పార్టీ చూస్తోందని, ఆ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలని పొగుడుతున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన కేశినేని నాని విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా ఫర్వాలేదని, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గానైనా గెలుస్తానేమోనని అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వాహించారు.
CM KCR: పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని అన్నారు. ఇప్పటికి బ్రాహ్మణుల్లో చాలామంది పేదలున్నారని.. బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్పిఎస్సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు
ఏపీ సీఎం జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై.. తమ్మినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోనో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు.