Published On:

4 Maoists Killed: మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు మావోల మృతి!

4 Maoists Killed: మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు మావోల మృతి!

4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ్ నందగావ్, బాలాఘాట్ డివిజన్లకు చెందిన మావోయిస్టులు దాదర్ అడవుల్లో సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో హాక్ ఫోర్స్, పోలీసులు కలిసి 25 బృందాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయని, అందులో భాగంగానే ఎదురుకాల్పులు జరిగాయని బాలాఘాట్ ఎస్పీ అదిత్య మిశ్రా తెలిపారు.

 

సెర్చ్ ఆపరేషన్ మావోలకు పోలీసులు ఎదురుపడటంతో వారిపై మావోలు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. అనంతరం మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థలి నుంచి గ్రనెడ్ లాంచర్, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. చనిపోయినవారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దండకారణ్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతే తమ లక్ష్యమని ఎస్పీ చెప్పారు.