Tirumala Sarvadarshanam: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం!
18 Hours for Tirumala Sarvadarshanam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు, వ్యవసాయ పనులు ప్రారంభమైనా.. భక్తుల రద్దీ తగ్గడం లేదు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసి పోతోంది. కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శానానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తుల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల్లో స్వామివారి దర్శనం అవుతోంది.
ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 81,037 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 30,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. కాగా సెప్టెంబర్ మాసానికి సంబంధించి శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవారి వసతి గదుల కోటా ఈనెల 23న విడుదల కానున్నాయి. ఇవాళ ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ ఓపెన్ కానుంది.