Home / Prime Minister Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ప్రధాని మోదీని మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానితో వారు మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు.
దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు జరిగిన ''మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోదీ తూప్రాన్ సకల జనుల సంకల్ప సభలో ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని మోదీ అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ తోనే సాధ్యమని మోదీ చెప్పారు. గద్వాలలో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని, ఓటమి భయంతోనే కేసిఆర్ కామారెడ్డినుంచి కూడా పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్ ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.
ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని నిజామాబాద్ లో పర్యటించనున్నారు. నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం.
నేడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఒంటిగంట 35 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు పాలమూరుకు చేరుకుంటారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ వాట్సాప్ చానల్ వారంలోపే 5 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. తన ఫాలోవర్లందరికీ కృతజ్జతలు తెలిపారు.