Home / Prime Minister Modi
Prime Minister Modi: భారత్-చైనా ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని మోదీకి శుక్రవారం చైనా అధికారికంగా ఆహ్వానం పలికింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధాని మొదటిసారి చైనాలో పర్యటించనున్నారు. శిఖరాగ్ర భేటీ సభ్యదేశాల మధ్య సంఘీభావం, స్నేహం, ఫలవంతమైన ఫలితాలకు వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేసింది. […]
MP Kamal Haasan: ప్రధాని మోదీని ఈ రోజు ఫిల్మ్ స్టార్, ఎంఎన్ఎం పార్టీ చీఫ్, ఎంపీ కమల్ హాసన్ కలిశారు. విషయాన్ని కమల్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. ప్రధానిని కలవడం గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తమిళ ప్రజల ప్రతినిధిగా, ఓ కళాకారుడిగా ప్రధాని మోదీ ముందుకు కొన్ని అభ్యర్థనలు తీసుకెళ్లినట్లు తెలిపారు. కీలడి కళాకృతులకు గుర్తింపు వచ్చేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని మోదీని కోరారు. తమిళ నాగరికత, తమిళ భాష వైభవాన్ని ప్రపంచానికి చాటే […]
PM Modi: ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ప్రధాని చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు హాజరుకానున్నారు. 2020 జూన్లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండటం ఇదే మొదటిసారి. మోదీ […]
Prime Minister Modi: ఇండియాకు మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ కింద మాల్దీవులకు ప్రముఖ స్థానం ఉందని చెప్పారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగిస్తామని తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుతో భేటీ అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు. వాణిజ్య, రక్షణ మౌలిక వసతులు తదితర రంగాల్లో పరస్పర సహకారానికి రెండుదేశాలు అంగీకరించాయని చెప్పారు. భారత్-మాల్దీవుల దేశాల మధ్య స్వేచ్ఛా […]
Operation Sindoor: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు విజయవంతం జరుగాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని ప్రస్తావించారు. వందశాతం లక్ష్యాలను సాధించాం.. ఆపరేషన్ సిందూర్లో దేశ సైనికుల సత్తాచాటారని కొనియాడారు. వందశాతం లక్ష్యాలను సాధించామని చెప్పారు. కచ్చితమైన లక్ష్యంతో 22 నిమిషాల్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్తో మేడిన్ ఇండియా సైనిక […]
Jammu Kashmir: జమ్మూకశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టాన్ని తయారు చేయాలని ప్రతిపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీకి వారు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లడాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కలపాలని కోరుతూ చట్టాన్ని చేయాలని కోరారు. ఐదేళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలు రాష్ట్ర హోదాను కోరారని తమ లేఖలో తెలిపారు. తమ డిమాండ్ చట్టపరమైందని, రాజ్యాంగ ప్రజాస్వామ్య […]
Prime Minister Modi visit to Namibia: ప్రధాని మోదీ నమీబియా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా బుధవారం ప్రధానికి అందజేశారు. అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోదీనే. 2014 సంవత్సరంలో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం. ఐదు దేశాల పర్యటనలో భాగంగా […]
CM Revanth Reddy Challenges KCR, Modi, Kishan Reddy: మూడు రంగుల జెండాచేతబూని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని, కాంగ్రెస్ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారని, కానీ పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తూ అపోహలను పటాపంచలు చేశారన్నారు. జనగణనతో […]
AICC President Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. హామీలను నెరవేరుస్తున్నాం.. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మోదీ, అమిత్షా […]
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రాత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో పియార్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో, ట్రినిడాడ్ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సెసార్ మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. సైనికుల వందనంతో పాటు భారతీయ పౌరాణిక పాత్ర ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానించారు. అయితే ఎయిర్ పోర్టు […]