Last Updated:

Train Tracks: లక్నోలో ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు .. తప్పిన పెద్ద రైలు ప్రమాదం

: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్‌లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్‌లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.

Train Tracks: లక్నోలో ఎండవేడికి కరిగిన  రైలు పట్టాలు .. తప్పిన పెద్ద  రైలు ప్రమాదం

 Train Tracks: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్‌లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్‌లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.

ట్రాక్ మరమ్మతులు ప్రారంభం..( Train Tracks)

కుదుపునకు గురైన లోకోమోటివ్ పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. అతను కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేయడంతో ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు సమస్యను గుర్తించి ట్రాక్ మరమ్మతులు ప్రారంభించారు.లక్నో జంక్షన్‌కు చేరుకోగానే పైలట్ ఫిర్యాదు చేసి ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. రైల్వే శాఖ సీనియర్ అధికారులు, ఉద్యోగులు కూడా దెబ్బతిన్న ట్రాక్‌లను పరిశీలించి మరమ్మతులకు ఆదేశించారు.

మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే..

లూప్ లైన్‌లో రైళ్లు రాకుండా స్టేషన్ మాస్టర్‌ను కూడా అప్రమత్తం చేశారు.లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) సురేష్ సప్రా ఈ విషయంపై సమగ్ర దర్యాప్తునకు విచారణకు ఆదేశించారు.ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లక్నో నుండి ప్రయాగ్‌రాజ్-ప్రతాప్‌గఢ్ మార్గంలో నిగోహన్ రైల్వే స్టేషన్ యొక్క ప్రధాన లైన్‌లో మరొక రైలు నిలిచిపోవడంతో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్ గుండా వెళ్ళిందని వర్గాలు పేర్కొన్నాయి.ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ రైలు ఘటనలో కూడా ఇదే జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.