India-Pakistan : ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్.. రుణాల కోసం పాక్ వెంపర్లాట

Pakistan’s ‘X’ account is fake : ఇండియా ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ పాకిస్థాన్పై పడింది. ఉగ్రస్థావరాలపై దాడిని సహించలేకపోయిన పాక్ భారత్ ఆర్మీ, సాధారణ పౌరులపై దాడికి పాల్పడింది. దీంతో పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత దిగజారిపోయింది. ఆర్థిక పరిస్థితిపై బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఇందులో ఇండియాపై అక్కసు వెళ్లగక్కడంతో నెట్టింట విమర్శలు ఎదుర్కొంది. దీంతో తాము రుణాల కోసం ఏ పోస్టు చేయలేదని, తమ ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయిందని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. దానిని సమర్థించుకొనేందుకు ‘ఫ్యాక్ట్ చెక్’ చేసినట్లు పాక్ సమాచార శాఖ ఓ పోస్టు చేసింది.
పాకిస్థాన్కు రుణాలు ఇవ్వొద్దు : ఇండియా
పాక్కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి రుణాలు రాకుండా అడ్డుకొనేందుకు ఇండియా తీవ్రంగా ప్రయత్రిస్తోందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా విధానం ఏంటో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టతనిచ్చారు. అంతర్జాతీయ మానిటరీ ఫండ్తో భేటీ కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ పోస్టుల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకులాయి. ‘యాచించేందుకు ఇదొక మార్గామా?’ అంటూ పాక్ను ట్రోల్ చేస్తూ పీఐబీ చేసిన పోస్టు వైరల్గా మారింది.