Home / జాతీయం
Air India : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కళాశాల భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారని, విమానంలో ఉన్నవారందరూ బతికి ఉండే […]
Air India condoles : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్’లో అధికారిక ఖాతాలో డీపీ మార్చింది. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 […]
Ahmedabad : అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం 1.39లకు లండన్ బయలు దేరింది. ఇందులో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 242 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 53 మంది […]
Ahmedabad : గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. అహ్మదాబాద్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్ నాయుడు, అమిత్ షాకు […]
Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఆప్ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి నియోజకవర్గమైన కల్కాజీలోని గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో అక్రమంగా నిర్మించిన 1200కు పైగా గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రభుత్వ తీరుపై ఆప్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిశి ఆరోపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు […]
Air India Ahmedabad-London flight crashes: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలింది. ఈ ప్రమాదంపై ఎయిరిండియా స్పందించింది. ఏఐ171 ఫైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం. కాగా, విమాన కూలిన ప్రదేశంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై పీఎం మోదీతోపాటు గుజరాత్, బెంగాల్, అస్సాం సీఎంలు భూపేంద్ర […]
Plane crash in Ahmedabad : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లో సివిల్ ఆసుపత్రి సమీపంలో విమానం కూలినట్లు జాతీయ మీడియా వెల్లడించాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని […]
Social Media Influencer Kamal Kaur : పంజాబ్లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్కింగ్ చేసిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కమల్ కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ […]
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు వర్గాల ప్రజలు విధ్వంసానికి దిగడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మిటాబ్రుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రబీంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహేస్తల ప్రాంతంలో నిర్మించిన శివాలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఆక్రమిత ప్రాంతంలో కొందరు షాపులు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. వివాదాస్పద భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. రెండు […]
Corona Virus : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల్లో 117 మందికి పాజిటివ్గా తేలింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,154 చేరాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం. కేరళలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గుజరాత్లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 467, యూపీలో 231, ఉత్తరప్రదేశ్లో 227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో మూడు మరణాలు […]