Home / జాతీయం
జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం గౌహతినగరంలోకి రాకుండా నిలిపివేశారు.
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.
శతాబ్దాల ఓర్పు, లెక్కేలేనన్ని త్యాగాలు, తపస్పు తరువాత మన శ్రీరాముడు వచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం భారత సమాజంలో సహనం, శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా వర్ణించారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రధాని మోదీ పర్యటనలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనవరి 22న అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు తిరుచిరాపల్లి లోని శ్రీ రంగనాథ స్వామి ఆశీర్వాదానికి వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న ఆండాళ్ అనే గజరాజుకి ప్రధాని మేత తినిపించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (ఆర్ సి హెచ్ ) పోర్టల్ కర్ణాటకలో కేవలం 11 నెలల్లో 28,657 మంది మైనర్ బాలికలు గర్బం దాల్చారని పేర్కొంది. వీరిలో 558 మంది గర్భిణీ బాలికలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కావడం విశేషం. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సగటున 2,600 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
: ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ను పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ఆయన పేర్కొన్నారు
జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) వర్గీకరణకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో సెక్రటరీల కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, మాదిగలు వంటి షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర సమూహాల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకోగల పరిపాలనా చర్యలను పరిశీలించడానికి క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేశారు.