Home / జాతీయం
PM Modi To Inaugurate Raisina Dialogue: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ సదస్సు నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా, ఈ రైసినా డైలాగ్ సదస్సు ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా మారనుంది. […]
Karnataka : దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. దీంతో యువత డ్రగ్స్కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కొందరు డబ్బుల ఆశకు డ్రగ్స్ వ్యాపారానికి పాల్పపడుతున్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట రోజు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా భారీగా డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ మేరకు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు […]
Uttar Pradesh : ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. కొన్ని రోజులుగా ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ప్రియుడు ప్రియురాలికి ఈ క్రమంలోనే నగదు, బంగారం కొనిచ్చేశాడు. ఇంతలోనే ఆమె వేరే వ్యక్తితో పరిచయం చేసుకొని ప్రియుడికి నమ్మించి మోసం చేసింది. ఈ ఘటన యూపీలోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. సహజీవనం సమయంలో ఇచ్చిన డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ప్రియుడు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే […]
India-Pakistan : ఇండియా పొరుగు దేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకుంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. పాక్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులుగా తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. […]
CM Revanth Reddy : తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, ప్రతిఒక్కరికీ ఫొటోలు దిగి చూపించాల్సిస అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో నియోజకవర్గాల డీమిలిటేషన్, త్రిభాషా అంశాలపై ఆయన తమిళ మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే నేతతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్హౌజ్కే పరిమితం అవుతున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ […]
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబల్ను చేర్చినట్లు పేర్కొంది. రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపీ సింబల్(₹) స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. విద్యా విధానంలో […]
Indian Railways : ట్రైన్లో అందించే ఆహారం నాసిరకంగా ఉందని, టాయిలెట్లు అశుభ్రంగా ఉన్నాయని, రైళ్లు ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తుండటం మనం చూస్తూ ఉంటాం. కానీ, ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. సౌత్ బిహార్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఏసీ కోచ్లో ఉన్న ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి తన బెర్త్ వద్ద ఎలుకలు తిరగటాన్ని గమనించాడు. అనంతరం రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటన […]
Ranya Rao : దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడిన నటి రన్యారావు కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. నటి పెళ్లి వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిగిన ఫొటో లీక్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సిద్ధిరామయ్య ఇంటి వరకు.. రన్యారావు స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చింది. […]
PM Modi says Mauritius is Family: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, గ్లోబల్ సౌత్కు మధ్య మారిషస్ ఒక వారధి అని వెల్లడించారు. మారిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదన్నారు. భారతదేశ కుటుంబంలో మారిషస్ ఓ భాగమని, మినీ ఇండియా అని మోదీ అభివర్ణించారు. […]
Prime Minister Narendra Modi to Visit Mauritius: ప్రధాని నరేంద్ర మోదీ మిత్రదేశం మారిషస్కు బయలుదేరారు. ఈ మేరకు ఆ దేశంలో రెండు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు. అలాగే మార్చి 12న జరగనున్న మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ఆహ్వానమేరకు ప్రధాని మోదీ మారిషస్కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాంను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు […]