Last Updated:

Manipur: మణిపూర్‌లో అక్టోబర్ 26 వరకు ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు

మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Manipur: మణిపూర్‌లో అక్టోబర్ 26 వరకు ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు

Manipur: మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదముంది.. (Manipur)

ఆంక్షలు త్వరలో ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రజలకు హామీ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. అయితే, రాష్ట్ర పోలీసు చీఫ్ యొక్క తాజా ఉత్తర్వులో ప్రజలను రెచ్చగొట్టే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు మరియు వీడియో సందేశాలను వ్యాప్తి చేయడానికి  కొంతమంది  సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించవచ్చనే ఆందోళన ఉందని ఆర్డర్ పేర్కొంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ప్రసారం చేయబడే వార్తల్లో రెచ్చగొట్టే అంశాలు, తప్పుడు పుకార్ల ఫలితంగా, ప్రాణ నష్టం, పబ్లిక్/ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లడం, ప్రజల ప్రశాంతతకు మత సామరస్యానికి విస్తృతమైన భంగం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం మరియు తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టడం ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవడానికి ఇంటర్నెట్ నిషేధం తప్పనిసరి అని రాష్ట్ర పోలీసులు పేర్కొన్నారు.

మే 3న కుకీలు, మైటీలు అనే రెండు జాతుల మధ్య జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుండి, దాదాపు 200 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మణిపూర్‌లోని హిల్ జిల్లాల్లో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో హింస చెలరేగింది. మే 5 నుండిరాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. సెప్టెంబర్ 23న ఇవి క్లుప్తంగా పునరుద్ధరించబడ్డాయి, అయితే రెండు రోజుల తర్వాత తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు వైరల్ కావడంతో మళ్లీ నిరసనలు చెలరేగాయి.