Home / Manipur
Manipur: కొంతకాలంగా ప్రశాంతంగా ఉంటున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్ ను ఇంఫాల్ లో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మెయితీ తెగకు చెందిన యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. షాపులను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లను కాల్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలు చేశారు. కానన్ సింగ్ ను వెంటనే […]
PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఇక వరదల్లో ఇప్పటివరకు 34 మంది మరణించినట్టు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు. కాగా పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ […]
NDA MLAs meet Manipur Governor: మణిపూర్లో కొత్త సర్కారు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్.బీరేన్ సింగ్ సీఎం పదవికి ఫిబ్రవరి 13వ తేదీన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది. ఈ క్రమంలోనే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధవారం రాజ్భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ […]
Manipur Violence is peace possible again: గత రెండేళ్లుగా జాతుల వైరంతో అట్టుడికిన మణిపూర్లో గత నెల రోజుల వ్యవధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మణిపూర్ హింసను అడ్డుకోవటంలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇదిలా ఉండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ నెల తొమ్మిదవ తేదీన తన పదవికి రాజీనామా చేయటంతో […]
President’s Rule Imposed in Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది […]
Manipur CM Biren Singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు. కొంతకాలంగా మణిపుర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షాను కలిసిన అనంతరం మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్.. నేరుగా తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ […]
Nitish Kumar’s JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్లోని బీజేపీ సర్కార్కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారనే వార్తలు రోజంతా చర్చలకు దారితీశాయి. దీంతో కేంద్రంలోనూ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారని మీడియా వాళ్లు చర్చలతో ఊదరగొట్టారు. అయితే, తీరా అసలు సంగతి తెలుసుకుని ‘ఇంతేనా’ అనుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ జరిగింది.. మణిపుర్లోని […]
Manipur attacking Army camp: మణిపుర్లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్ స్టేషన్పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు కొందరు గాయపడ్డారు. జకురాడోర్ కరోంగ్లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. […]
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.
మణిపూర్లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పవర్ స్టేషన్ నుంచి భారీ ఇంధనం లీకై దాని పక్కనే ప్రవహించే వాగుల్లో కలిసింది. కొన్ని చోట్ల వాగుల్లో మంటలు రేగడంతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. కాంటో సబల్, సెక్మాయి వంటి గ్రామాల మీదుగా వెళ్లే వాగుల్లో ఇంధనం కలిసిందని వారు తెలిపారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తం అయింది.