Published On:

Indian Army: దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా.!

Indian Army: దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా.!

Indian Army: ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ ప్రతీకార చర్యకు పుణుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పాక్ చర్యను తిప్పి కొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే నేవి అండర్‌లో విశాఖ విమానాశ్రయం ఉంది. విశాఖను డేగ కళ్ళతో తూర్పు నావికాదళం చూస్తుంది.

 

సముద్ర తీరం వెంబడి  చొరబాటుదారులు రాకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా పెట్టారు. ఆపరేషన్ అభ్యాస్‌లో భాగంగా విశాఖలో నిర్వహించిన మాక్ డ్రిల్ సక్సెస్ అయింది. ఈ మాక్ డ్రిల్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్, ఎన్‌సీసీ, పోలీస్, ఫైర్, వైద్య విభాగాల సిబ్బంది పాల్గొన్నాయి. విశాఖ, గంగవరం పోర్టుల వద్ద సిఐఎస్ఎఫ్ భద్రత బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ నగరంమెుత్తం నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉంది. కేంద్ర రక్షణ శాఖ ఆదేశాలు తర్వాత విశాఖ విమానాశ్రయంనుండి భారత వైమానిక దళం దాడికి సిద్ధంగా ఉంది.

 

ఇదిలా ఉంటే.. ఇస్లామాబాద్, లాహోర్‌లలో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. లాహోర్‌లో వరుస పేలుళ్ల నేపథ్యంలో లాహోర్ ఎయిర్‌పోర్ట్ మూసివేశారు. ఈ పేలుళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇస్లామాబాద్‌లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి వైద్యులకు సెలవులు రద్దు చేశారు. వరుస పేలుళ్లతో లాహోర్, ఇస్లామాబాద్ భయంతో వణికిపోతుంది.