Last Updated:

CM Ashok Gehlot: రాజస్ధాన్ లో మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు

రాజస్థాన్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజనతో అనుసంధానమైన మహిళలకు త్వరలో ఉచిత ఇంటర్నెట్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ ప్రకటించారు

CM Ashok Gehlot: రాజస్ధాన్ లో మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు

Jaipur:  జైపూర్ నవాన్ పట్టణంలోని నాగౌర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు పేర్కొన్నారు. ఈ పధకం ద్వారా 1.35లక్షల మందికి ఫోన్లు అందనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పధకాలను సీఎం గహ్లోత్ వివరించారు. అద్భుతమైన ప్రణాళికలు, బడ్జెట్ లో సుపరిపాలన అందించేందులో రాజస్ధాన్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.

ప్రధాని మోదీ కేంద్ర పరిధిలోని వ్యవస్ధలను అడ్డుపెట్టుకోని ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పొడుతున్నారని విమర్శించారు. గత 8ఏళ్లలో ఎక్కడైనా బిజెపి నేతలపై దాడులు జరిగాయా అంటూ ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ దాడులు చేపట్టేలా సిబిఐ, ఆదాయపు పన్ను శాఖలకు ఆ బాధ్యతను అప్పజెప్పిన్నట్లు గహ్లోత్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: