Last Updated:

Rabridevi: మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరయిన బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గురువారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ముందు ఉద్యోగాల భూములు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.ఈడీ ఉదయం రెండున్నర గంటలపాటు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమె మళ్లీ భోజన విరామం తరువాత విచారణకు హాజరయ్యారు.

Rabridevi: మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరయిన  బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి

Rabridevi: బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గురువారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ముందు ఉద్యోగాల భూములు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.ఈడీ ఉదయం రెండున్నర గంటలపాటు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమె మళ్లీ భోజన విరామం తరువాత విచారణకు హాజరయ్యారు.

మార్చి 15న బెయిల్ మంజూరు..(Rabridevi)

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆమెను విచారిస్తున్నారు. అంతకుముందు ఆమెను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించింది.ఈ కేసుకు సంబంధించి మార్చి 15న ఆర్జేడీ అధినేత, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేయకుండానే చార్జిషీట్ దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రతి నిందితుడు రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అదే మొత్తాన్ని పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింది. సంబంధిత కేసులో నిందితులుగా ఉన్న మరో 13 మందికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మార్చిలో ప్రశ్నించింది. ఈ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎంపీ కుమార్తె మిసా భారతి సహా రబ్రీ దేవి పిల్లలను సీబీఐ ఇటీవల ప్రశ్నించింది.

మార్కెట్ ధరల్లో ఐదవ వంతుకే భూములు..

2004 మరియు 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చిన లేదా విక్రయించిన భూములకు బదులుగా రైల్వేలో నియామకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. రైల్వేలో అక్రమ నియామకాలు జరిగాయని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. రిక్రూట్‌మెంట్ కోసం భారతీయ రైల్వేలు నిర్దేశించిన నిబంధనలు మరియు విధానాలను పక్కన పెట్టారని తెలిపింది. క్విడ్ ప్రోకోగా, అభ్యర్థులు నేరుగా లేదా వారి సమీప బంధువులు మరియు కుటుంబ సభ్యుల ద్వారా అప్పటి రైల్వే మంత్రి, లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రస్తుత మార్కెట్ ధరల్లో ఐదవ వంతు వరకు అధిక తగ్గింపు ధరలకు భూమిని విక్రయించారని ఆరోపించింది. మనీలాండరింగ్ కేసు సిబిఐ ఎఫ్‌ఐఆర్ నుండి వచ్చింది. ఈ కేసులో ఈడీ కొంతకాలం క్రితం సోదాలు నిర్వహించి, లెక్కల్లో చూపని కోటిరూపాయల నగదుస్వాధీనం చేసుకుని, రూ. 600 కోట్ల విలువైన నేరాలను గుర్తించింది. యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించి ఈ కుంభకోణం జరిగింది.