YouTuber Haryana: మరో యూట్యూబర్ జ్యోతి అరెస్ట్.. భారతీయులే ఇన్ఫార్మర్స్!

A popular YouTuber Jyoti Malhotra from Haryana Arrested: హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులకు కీలమైన సమాచారాన్ని చేరవేస్తుందనే సమచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి వాటిలో భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఆమె ‘జట్ రంధావా’ పేరుతో సేవ్ చేసిన శాకిర్ అలియాస్ రాణా షహబాజ్ అనే పాకిస్థాన్ గూఢచారితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఆమె ‘Travel with Jo’ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఇక, హర్యానాతో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో నెట్ వర్క్ విస్తరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గుజాలా, బాను నస్రీనా, యామీన్ మహ్మద్, అర్మాన్ ఉన్నారు.
ఇప్పటికే పలు ఆరోపణలతో హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతకుముందు, మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్కు కీలక సమాచారం చేరవేయడంతో భారతీయులు ఉండడంతో ఆందోళన నెలకొంది. వీరిని పాక్ ట్రాపింగ్ చేసిందా? లేదా వీళ్ల వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.