Last Updated:

NIA Raids: హర్యానా, రాజస్థాన్‌లోని 31 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, రాజస్థాన్‌లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాలలో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.

NIA Raids: హర్యానా, రాజస్థాన్‌లోని 31 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

NIA Raids: సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, రాజస్థాన్‌లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాలలో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.

ఎన్ఐఏ దర్యాప్తు..(NIA Raids)

హత్యలో హై-ప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్ల ప్రమేయాన్ని పరిగణనలోకి తీసుకుని రాజస్థాన్ పోలీసుల నుండి ఎన్ఐఏ కేసును స్వాధీనం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ సోదాలు జరిగాయి.కర్ణి సేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఆయన నివాసంలో ముగ్గురు షూటర్లు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా గోగమేడి హత్యకు బాధ్యత వహించాడు.ఇద్దరు షూటర్లు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్‌లో అరెస్టు చేశారు. హత్యకు ఆదేశించింది గోదారా అని వారు పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్ మరియు దనరామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

వైభవ్‌ గెహ్లాట్‌ నివాసంలో ఈడీ సోదాలు..

విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం (జనవరి 3) సోదాలు నిర్వహించింది ఫెమా యొక్క ఆరోపణ ఉల్లంఘనలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ సోదాలు జరిగాయి.అక్టోబర్ 2023లో, ఈ కేసుకు సంబంధించికి వైభవ్ ఢిల్లీలో ఈడీ ముందు హాజరయ్యారు.

31 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు..

ఉదయ్‌పూర్‌లో వ్యాపార సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కూడా దాడులు నిర్వహిస్తోంది. ఉదయపూర్ నగరంలోని 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హోటల్ రాడిసన్ బ్లూ, హోటల్ ఫతే ప్రాంగణాల్లో దాడులు నిర్వహించారు.వ్యాపార సంస్థలకు సంబంధించిన కోల్‌కతా, ముంబై ప్రాంతాల్లో కూడా సోదాలు జరిగాయి. రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని మొత్తం 31 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు బృందం అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.