Last Updated:

Nagpur: నాగ్‌పూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 23 మంది రోగుల మృతి

మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూనే ఉంది. నాగ్‌పూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరతపైప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరణాలు సంభవించడం గమనార్హం.

Nagpur: నాగ్‌పూర్‌లోని రెండు  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  24 గంటల్లో 23 మంది రోగుల మృతి

Nagpur: మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూనే ఉంది. నాగ్‌పూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరతపైప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరణాలు సంభవించడం గమనార్హం.

రోగులు చివరి నిమషంలో వస్తున్నారు..(Nagpur)

నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ 2 మధ్య 48 గంటల్లో 31 మంది రోగులు మరణించారు. అలాగే, ఛత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం 24 గంటల వ్యవధిలో 18 మంది మరణించారు. 24 గంటల్లో 14 మరణాలు నమోదైన నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి (GMCH) 1,900 పడకల సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ ప్రతిరోజూ సగటున 10 నుండి 12 మంది రోగుల మరణాలు నమోదవుతున్నాయి. ఆసుపత్రి డీన్ రాజ్ గజ్భియే మాట్లాడుతూ రోగులలో ఎక్కువ మంది చివరి నిమిషంలో రిఫరల్స్ మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) అడ్మిషన్ అవసరమయ్యే వారేనని తెలిపారు. అదేవిధంగా, ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి (IGGMCH) 800 పడకల సామర్థ్యం కలిగి ఉంది. మరణించిన రోగులలో ఎక్కువ మంది క్రిటికల్ కండిషన్‌లో ఉన్నవారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో తగినంత మందులు మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.