India – Bangladesh: భారత్ – బంగ్లాకు మధ్య మరో వాణిజ్య యుద్ధం

India – Bangladesh Economic Warfare: బంగ్లాదేశ్కు .. ఇండియాకు మధ్య మరోమారు వాణిజ్య యుద్ధం మొదలైంది. బంగ్లాదేశ్ ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది భారత ప్రభుత్వం. కాగా కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ తమ వస్తువులను ఇండియాకు ఎగుమతి చేయాలంటే కేవలం కోలకతా.. ముంబై పోర్టుల ద్వారా అనుమతిస్తారు. గతంలో మాదిరిగా రోడ్డు మార్గాన అనుమతించడంలేదు. దీనికి కారణం బంగ్లాదేశ్ కూడా ఇండియా ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది. దానికి బదులుగా ఇండియా కూడా బంగ్లాదేశ్ వస్తువులపై కొన్ని నిర్భంధాలను విధించాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్కు సుమారు 770 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.
చైనా – అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాద్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పలు దేశాలకు మింగుడుపడ్డం లేదు. ప్రపంచంలోని అన్నీ దేశాలు అమెరికాపై పడి దోచుకున్నాయని ఆరోపించాడు. అందుకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై భారీ ఎత్తున సంకాన్నివిధిస్తూ వారి వస్తువులను అమెరికాలో డిమాండ్ లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ట్రంప్. చైనాపై ఏకంగా 145 శాతం టారిఫ్ విధించాడు. అలాగే ప్రపంచంలోని అన్నీ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఎడాపెడా సుంకాన్ని బాదుతున్నాడు. ఇక తాజాగా ఆయన కన్ను ఇండియాపై పడింది. అమెరికాలో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అమెరికా నుంచి ఇండియాకు డబ్బు పంపిస్తే ఐదు శాతం పన్ను చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. దీంతో ఇండియన్స్పై అదనపు భారం పడుతుంది.