Published On:

TTD – BR Nayudu: తిరుమల కొండల్లో పచ్చదనం పెంపు

TTD – BR Nayudu: తిరుమల కొండల్లో పచ్చదనం పెంపు

TTD – BR Nayudu: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వరస్వామి, ఒంటిమిట్ట ఆలయంతోపాటు స్థానిక ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 అతిధి గృహాల పేర్లు మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్విమ్స్ ని అభివృద్ధి చేయాలని, 597 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది.

 

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం. సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ అటవీ భూముల్లో పచ్చదనం పెంపుకు రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేశారు. తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వరస్వామి, ఒంటిమిట్ట ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను అభివృద్ధిపై నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 అతిధి గృహల పేర్లు మార్పు భక్తుల సౌకర్యార్థం ఆకాశగంగా, పాపవినాశనం ప్రాంతాల అభివృద్ధిని చేయనున్నారు. స్విమ్స్ అభివృద్ధితో పాటు 597 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి: