Last Updated:

TSPSC paper leak case: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. 48 మంది అరెస్టుకు రంగం సిద్దం

టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఏఈ, ఏఈఈ, డిఏవో పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్‌ని సిట్ అధికారులు తయారు చేశారు. మరో 48మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38మంది అభ్యర్థులు 10మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది.

TSPSC paper leak case: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. 48 మంది అరెస్టుకు రంగం సిద్దం

TSPSC paper leak case: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఏఈ, ఏఈఈ, డిఏవో పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్‌ని సిట్ అధికారులు తయారు చేశారు. మరో 48మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38మంది అభ్యర్థులు 10మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది.

చేతులు మారిన 80 లక్షలు..(TSPSC paper leak case)

నిందితుల కాల్ డేటా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారంగా సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. వారి ద్వారా మరో 80 లక్షల రూపాయల వరకూ చేతులు మారాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్‌సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల వివరాలని సేకరించారు. నిందితుడు రమేష్ కాల్ డేటా ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేశారు.

సిట్ సభ్యులు బ్యాంకు లావాదేవీలతో సహా సాంకేతిక మరియు శాస్త్రీయ ఆధారాల సమగ్ర సేకరణను సమీకరిస్తున్నారు, ఇది నేరస్థుల కుట్రలను చాలా వరకు వెలికితీసింది. విచారణలో, పరీక్ష ఆశావాదులతో పాటు గణనీయమైన సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు కనుగొనబడింది. పదిహేను మంది నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా, టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన ప్రవీణ్ మరియు రాజశేఖర్‌ల బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి.