Last Updated:

TSPSC paper: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక అప్టేడ్

ప్రశ్నాపేపర్‌ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది.

TSPSC paper: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక అప్టేడ్

TSPSC paper: తెలంగాణలో సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కమిషన్‌ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నిస్తోంది. కేసుకు సంబంధించి ఇరువురిని విచారించి.. ఈడీ అధికారులు వాంగ్మూలాలు రికార్డ్ చేయనున్నారు. ప్రధానంగా డబ్బు లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది.

 

మనీలాండరింగ్ కోణంలో(TSPSC paper)

ప్రశ్నాపేపర్‌ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. ఇప్పటికే చంచల్‌గూడ జైళ్లో నిందితులను విచారించిన ఈడీ వారి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీలో ఇప్పటి వరకు రూ. 38 లక్షల లావాదేవీలు జరిగినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. సిట్ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శిని అధికారులు విచారిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు పై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికి నెలన్నర రోజులు అయినా సిట్‌ దర్యాప్తు ఎందుకు పూర్తి అవడం లేదని ప్రశ్నించింది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. సిట్‌ దర్యాప్తు కొంతవరకు సంతృప్తిగా ఉన్నా.. దర్యాప్తు లో వేగం లేదని అభిప్రాయపడింది. అయితే దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత దశలో ఈ కేసులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

జూన్‌ 5 కి వాయిదా

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు ఇంకెంతకాలం చేస్తారని హైకోర్టు.. సిట్‌ను ఉద్దేశించి ప్రశ్నించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి, సభ్యుడిని విచారించామని సిట్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీల్లో ఒకరి నుంచి అభిప్రాయం తీసుకోవడానికి అనుమతి ఇవ్వగలరా? అని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది.

దీనికి హైదరాబాద్ సీపీ పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతోందని ఏజీ సమాధానం ఇచ్చారు. ‘ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది అందరినీ విచారించారా? ఎంతమంది ఈ కేసులో లబ్ధి పొందారు? జూన్‌ 5న దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలి’ అని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పేపర్ లీకేజీ లో తదుపరి విచారణను జూన్‌ 5 కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.