Home / తప్పక చదవాలి
రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో జేబెల్ అలీ ప్రాంతంలోని వర్షిప్ గ్రామంలో కొత్తగా నిర్మించిన హిందూ టెంపుల్ పేరుతో కొత్త ఆలయాన్ని భక్తుల దరి చేర్చారు. విజయదశమి పర్వదినం నుండి ఆలయాన్ని దర్శించుకొనేందకు భక్తులకు అనుమతి కల్గించారు
భారత ప్రభుత్వం చమురును ఎక్కడి నుండైనా కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని, ఏ దేశమూ భారత్ను కొనుగోలు చేయడం మానేయమని చెప్పలేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
పవిత్ర పెరటాశి మాసం పురస్కరించుకొని తితిదే భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీ మేర క్యూలైన్లలో వేచివున్నారు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కరోనా సమయం నుంచి విద్యార్థులు చరవాణీల వాడకం పెరిగిపోయింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని పిల్లలకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు కొనిచ్చారు. దానితో పిల్లలు మొబైళ్లకు బానిసలయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్ నాశనం అవుతుందని భావించిన మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో చూసేద్దామా.
దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ పౌరులకు తీపి కబురు అందించింది. బ్యాంకు ఖాతాతో పనిలేకుండా నగదు లావాదేవీలను చేపట్టే డిజిటల్ రూపాయిని (ఇ-రూపీ)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది