Home / తప్పక చదవాలి
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది.మేడిగడ్డ రిజర్వాయర్పై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.
ఐదు గ్యారంటీల కోసం అప్లై చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. బాలానగర్ ఫ్లైఓవర్పై బైక్పై నుంచి ఫామ్స్ చిందరవందరగా పడిపోయాయి. ఎవరో ర్యాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపాడు. సుమారుగా 500 వరకు ఉన్న ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై.. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించడానికి.. ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది.
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.
యునైటెడ్ స్టేట్స్ లో పదవీ విరమణ పొందిన ఒక జంట విన్ ఫాల్ లాటరీలో సుమారుగా రూ.200 కోట్లు సంపాదించారు. గణిత శాస్త్రంలో ప్రావీణ్యాన్ని ఉపయోగించి దాని ప్రకారం లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి వారు ఈ భారీ మొత్తాన్ని పొందగలిగారు.
మయన్మార్ లోని వాయువ్య ప్రాంతంలో ప్రజాస్వామ్య అనుకూల ప్రతిఘటన నియంత్రణలో ఉన్న ఒక గ్రామంపై పాలక మిలిటరీ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 17 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలోతొమ్మిది మంది పిల్లలతో సహా 20 మందికి పైగా గాయపడ్డారని స్థానిక నివాసితులు మరియు మానవ హక్కుల సమూహం తెలిపింది.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.
రాబోయే లోక్హ సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్దమయింది. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్చార్జ్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 పార్లమెంట్ స్థానాలకి ఇన్చార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్, హరీష్ రావులు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆయన్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు.