Last Updated:

Road Accident : కరీంనగర్ జిల్లాలో విషాదం.. రోడు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో

Road Accident : కరీంనగర్ జిల్లాలో విషాదం.. రోడు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

Road Accident : కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..  మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ముగ్గురు యువకులు మృతితో వారి గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే మృతులంతా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పని ముగించుకొని రేణిగుంటలో ఓ దాబాలో భోజనం చేసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాల సేకరించారు. మృతులు..  గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26)గా గుర్తించారు.