Home / తెలంగాణ
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గద్దర్ మృతిపట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది బాధాకరమైన రోజు అని.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పని చేశారని, యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో గద్దర్ పాత్ర ఉందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది.
ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో (ఆగస్టు 6) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ శాసన సభలో శనివారం పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకి సత్వరమే ఆమోదం తెలుపనందుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఈ ఉదయం బస్సులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. రాజ్భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ర్యాలీగా చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్న గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చలకు ఆహ్వనించారు.
హైదరాబాద్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓవైపు చారిత్రక చార్మినార్ వెలుగు జిలుగులు… మరోవైపు తళుకులీతున్న ఆకాశహర్మ్యాలు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో వెరసీ ప్రపంచమంతా
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.