Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా, పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఎక్కువమంది ప్రతిపాదించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఉదయం నుంచే సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్తో సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో పలుసార్లు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది
సీఎం కేసిఆర్ ను దేశ్ కీ నేతగా ఆ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుంటే...సీఎం కేసిఆర్ బంగారు తెలంగాణాను దరిద్ర తెలంగాణాగా మారుస్తున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు
శుభాన్ని కల్గించే పాలపిట్టను దసరా రోజున చూడాలంటారు. ఇది తెలంగాణలో బలమైన ఆత్మీయ సెంటిమెంట్. దీని కోసం నేరుగా చూడని వారు సైతం ఫోటోలను షేర్ చేస్తూ పాలపిట్ట వల్ల కలిగే శుభాన్ని ఆశిస్తూ ఉంటారు. సెంటిమెంట్ తో కూడిన ఆ పాలపిట్ట వ్యవహారం ఓకరికి తంట తెచ్చి పెట్టింది. దీంతో ఆ ముఖ్య నేత వివాదంలో చిక్కుకొని గిలగిల లాడుతున్నారు.
పని చేసే ఉద్యోగం ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు. ఉద్యోగ బాధ్యతలు ఏ మేరకు నిర్వహించామో అన్నది ప్రధానం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా అడపా దడపా ప్రశంసలు కూడా అందుకొంటుంటారు. వీరిలో ఒకరిగా హైదరాబాదు హోంగార్డ్ తన నిజాయితీని ప్రదర్శించి అందరి మన్నన్నలు అందుకొన్నాడు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఓటు హక్కును కోరకుంటూ కొత్తగా 23వేల మంది దరఖాస్తులు చేసుకొన్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
భాగ్యనగరంలో భారీ సెల్ ఫోన్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పొడే ముఠా పనిగా తేల్చారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులపై కాల్పులకు కూడా నిందుతులు పాల్పొడ్డారు. చివరకు హైదరాబాదు పోలీసులకు చిక్కారు
నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, అనిల్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు.