Home / తెలంగాణ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మునుగోడులో కొత్త ఓటు హక్కు, చిరునామా బదిలీల రూపంలో రికార్డు స్థాయిలో 25వేలకు పైగా దరాఖస్తులు చేసుకొన్నారు. ఇదంతా రాజకీయ దురుద్ధేశంతోనే ఇన్ని దరాఖాస్తులు నమోదు చేసుకొంటున్నారని భాజపా తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణా సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ కోసం భారీ నగదు వెచ్చించి ఓ చార్టర్ విమానాన్ని కొనుగోలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు కాలుదువ్వగా, తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు
శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవములు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన ఈ ఉత్సవాలను అక్టోబర్ 11నుండి 15వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో ఉత్సవాలను అర్చక స్వాములు నిర్వహించనున్నారు. అంకురార్పణతో వైదిక క్రతువులు ప్రారంభించారు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈప్రచార సామాగ్రిని దుండగులు దగ్ధం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ మాట్లాడే మాటలు, బ్రోకర్ మాటలుగా భాజపా శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో హుషారుగా, జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఈటెల సీఎం కేసిఆర్ పరిపాలన తీరును ప్రజలకు తెలియచేస్తున్నారు.
తెలంగాణ బీజేపీలో రేసులోకి మరో వారసురాలు వస్తున్నట్లే కనిపిస్తోంది. సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వారసురాలు రాజకీయం రంగంలోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.