National Green Tribunal: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి షాక్…3800 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో రూ. 3800 కోట్లు ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది

Telangana: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో రూ. 3800 కోట్లు ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1996లో వ్యర్ధాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్ధ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014లో పిటిషన్ ఎన్జీటీకి బదిల చేశారు. పిటిషన్ పేర్కొన్న మేర విచారణకు స్వీకరించిన ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యర్ధాల నిర్వహణకు చర్యలు చేపట్టి పురోగతి చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.