BRS Chief KCR : ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం

BRS Chief KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లిలోని ఫౌమ్హౌస్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్రావు, వనం వెంకటేశ్వరరావు, లింగాల కమల్రాజ్ పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆశన్నగారి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్రావు పాల్గొన్నారు.