A.M.Rathnam: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కల్యాణ్ సినిమా నిర్మాత

Hari Hara Veera Mallu Producer A.M.Rathnam Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏఏం రత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నిర్మాణ సంస్థ ఓ పోస్టు షేర్ చేసింది. ఇందులో 17వ శతాబ్దానికి సంబంధించిన స్టోరీతో సినిమా చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు.
అంతేకాకుండా, సినిమా టికెట్ల ధరల విషయంపై ప్రత్యేకంగా ఆయనతో చర్చించనట్లు వివరించారు. సీఎంకు విషయం చెప్పగానే సమయం కేటాయించి కలిసినందుకు రేవంత్కు రత్నం ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Today, I had the honour of meeting Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu to discuss our film #HariHaraVeeraMallu. This project is a passion-driven historical epic set in the 17th century during the Mughal period, depicting the Battle of Dharma. It is made on a grand… pic.twitter.com/LskevdQp5g
— AM Rathnam (@AMRathnamOfl) May 30, 2025