Alla Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు!

Case registered against former MLA Alla Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్షాక్ తగిలింది. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు 127వ నిందితుడిగా చేర్చారు. వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఘటనకు కారణమైన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును సీఐడీకి బదిలీ చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు హత్యాయత్నంతోపాటు పలు నేరాలను కేసులో జోడించి కొందరిని అరెస్టు చేశారు. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్తోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నిందితులుగా ఉన్నారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, అనంతరం బెయిల్పై విడులయ్యారు. కేసులో 44 మంది 11 బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా, వారందరికీ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిని 120వ నిందితుడిగా పేర్కొంటూ రెండు వారాల కింద సీఐడీ విచారించింది. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడం కీలకంగా మారింది.