India Pakistan: పాకిస్థాన్ పై ఆర్థిక యుద్ధం దిశగా భారత్
India Pakistan: పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే జల యుద్ధం ( సింధూ నది జలాల నిలుపుదల) దౌత్య పరమైన ఆంక్షలు, పాకిస్థానీ పౌరులను ఆదేశానికి పంపించేయడం లాంటి చర్యలకు పూనుకుంది.
ప్రస్తుతం పాకిస్థాన్ పై అర్థిక దాడులను ప్లాన్ చేస్తోంది భారత్. ఇది రెండు రకాలుగా ఉండనుంది. మొదటిది, పాకిస్థాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రేలిస్ట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించనుంది. రెండవది, ఉగ్రవాదులను తయారుచేయడంలో భాగంగా ప్రపంచ దేశాలు ఇస్తున్న నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, పాకిస్థాన్ కు 7బిలియన్ల సహాయ ప్యాకేజీపై భారత్ ఆందోళన లేవనెత్తనుంది.
జూన్ 2018న గ్లోబల్ మనీలాండరింగ్ & టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ యొక్క ‘గ్రే లిస్ట్’లో పాకిస్తాన్ను ఉంచగా, అక్టోబర్ 2022లో జాబితా నుండి తొలగించారు. పాకిస్థాన్ FATF గ్రే లిస్ట్ హోదాను తిరిగి పొందినట్లయితే ఆదేశపు ఆర్థిక లావాదేవీలపై పరిశీలన పెరుగుతుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాలు పరిమితమవుతాయి. ఇందుకుగాను FATF దేశాలతో చర్యలు జరుపనుంది భారత్. 40 సభ్య దేశాలతో కూడిన ప్లీనరీ సాధారణంగా సంవత్సరానికి మూడుసార్లు జరుగుతుంది.(ఫిబ్రవరి, జూన్, అక్టోబర్).
పాకిస్థాన్ ఊహించని విధంగా భారత్ పథకాన్ని సిద్ధం చేస్తోంది. పహల్గాంలో జరిగిన దాడిలో 26మంది ప్రాణాలను బలిగొన్నారు. ఇందుకు పాకిస్థాన్ కేంద్రంగాగల లష్కరే తోయిబా తీవ్రవాద గ్రూపుకు హస్తం ఉంది. పాకిస్థాన్తో దౌత్య సంబంధాలను తగ్గించడమే కాకుండా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. ఆదేశంతో వ్యాపారలావాదేవీలను నిలిపివేసింది. పాకిస్థాన్ జాతీయులకు వీసా సేవలను రద్దు చేసింది. ఇవే కాకుండా 16పాకిస్థానీ యూట్యూబ్ చానల్లను నిషేధించింది. పాకిస్థానీ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, హనియా అమీర్, మహిరా ఖాన్, అలీ జాఫర్ వంటి పాక్ సినీ తారల సోషన్ మీడియా ఎకౌంట్ లను నిలిపివేసింది.
పహల్గామ్లో పర్యాటకులపైన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దవాతావరణం నెలకొంది. దీంతో గతంలో ఇండియా చేసిన యుద్ధాలతో పాటు భారత యుద్ధ సామాగ్రిపైనా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 1971 పాకిస్థాన్ యుద్ధంలో కీలకపాత్ర పోషించి, జాతికి అంకితం చేయబడిన ఐఎన్ఎస్ కుర్సురా సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత నావికా దళంలో 31 సంవత్సరాలు సేవలందించి ఉపసంహరించబడిన జలాంతర్గామి INS కుర్సురా.. ఇప్పటికీ విశాఖ నౌకాదళం డ్రెస్సింగ్ షిప్ గౌరవాన్ని అందుకుంటోంది. అలాగే విశాఖ ఆర్కే బీచ్లో భద్రపరిచిన ‘ఐఎన్ఎస్ కుర్సురా’ను పర్యాటకుల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు.