Last Updated:

 Janasena Formation Day : నేడు పవన్ కళ్యాణ్ “జనసేన” 10వ ఆవిర్భావ సభ.. పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం

పవన్ కళ్యాణ్ సారధ్యం లోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు.

 Janasena Formation Day : నేడు పవన్ కళ్యాణ్ “జనసేన” 10వ ఆవిర్భావ సభ.. పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం

 Janasena Formation Day : జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సభ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆవిర్భావ సభ కోసం కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.

35 ఎకరాల్లో సభ..  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం..

బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభా స్థలంలో 1,20,000 మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాటు చేయగా.. ఎల్ ఈడీ స్క్రీన్స్ తో 10 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యిందని నేతలు వెల్లడించారు.

ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ర్యాలీలో మార్పులు..

కాగా పవన్ కళ్యాణ్ ర్యాలీలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా అనుకున్నట్టు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా.. శాసనసభకు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ..మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనంలో మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారు. పోలీసులు చేసిన విజ్ఞప్తికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదనీ. నిర్దేశించిన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు జనసైనికులు సిద్దంగా ఉండాలని సూచించారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలనీ, వారాహి వాహనానికి ఏ మాత్రం అడ్డు రాకుండా సభాస్థలికి ఎంతో జాగ్రత్తగా తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంపై పవన్ మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారని అన్నారు.

2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్న వేళ.. భారీ ర్యాలీతో బందర్ రావటానినికి సిద్ధం అవుతున్న జనసేన కర్యకర్తలు, నేతలు. అయితే ర్యాలీపై పోలీసుల ఆంక్షలతో ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటూ కృష్ణ జిల్లా ఎస్పీ జాషువ ప్రకటించారు. విజయవాడ మచిలీపట్టణం జాతీయ రహదారిపై సభలు, ప్రదర్శనలలకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు ఉందని.. ఈ నియమాలను ఉల్లంగించిన వారిపై తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పవన్ ఏం ప్రకటన చేస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా వెళ్తారా? లేదా టీడీపీ, బీజేపీతో కలిసి పయనిస్తారా? అన్నది ఈ సభలో పవన్ మాట్లాడతారని వెల్లడించే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఓటు చీలకుండా చేస్తామన్న పవన్ ఏ నిర్ణయం తీసుకున్న అందుకు కట్టుబడి ఉంటామని జనసేన నేతలు, కార్యకర్తలు వెల్లడిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/