Home / janasena chief pawan kalyan
BTS Video Song Of Hari Hara Veera Mallu 1st Single: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ విపరీతంగా క్రేజీ సంపాదించుకుంది. తాజాగా, మేకర్స్ […]
ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, ఇది ఏపీ భవిష్యత్కు బలమైన పునాది వేసే సమయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని సీఎం జగన్ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాసారు.
ఆంధ్రప్రదేశ్ లో 42 రోజులనుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య బద్దంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మెుదటిసారి పవన్తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్తో చర్చించారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య అభిలషించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులు సమగ్ర భూరక్ష చట్టంపై పవన్ మద్దతు కోరారు. సమావేశంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ న్యాయవాదుల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ఈనెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.