Home / అంతర్జాతీయం
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.
ఇరాన్లో బుధవారం జంట పేలుళ్ల కారణంగా 73 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. 2020 యుఎస్ డ్రోన్ దాడిలో మరణించిన టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని సంస్మరణ వేడుకలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అత్యవసర సేవల ప్రతినిధి బాబాక్ యెక్తపరాస్ట్ 73 మంది మరణించారని, 170 మంది గాయపడ్డారని తెలిపారు.
జపాన్లో కొత్త ఏడాది మొదటిరోజే బలమైన భూకంపాలు సంభవించిన సుమారుగా 30 మంది మరణించారు. సోమవారం జపాన్ 155 భూకంపాలతో దెబ్బతింది, వీటిలో ప్రారంభ భూకంపం తీవ్రత 7.6 కాగా పలు భూకంపాలు 6 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది.
బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్కు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అతని మద్దతుదారులు దీనిని రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించారు.
సోమవారం జపాన్లో వరుసగా బలమైన భూకంపాలు సంభవించాయి. దీనితో జపాన్ వాతావరణ సంస్ద సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను త్వరగా తీరప్రాంతాలను విడిచిపెట్టమని కోరింది.జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంపం ఇషికావా మరియు సమీపంలోని ప్రిఫెక్చర్లను తాకింది,
ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్న హౌతీ తిరుగుబాటు దారులపై అమెరికా నేవీ హోలికాఫ్టర్లు కాల్పులు జరపడడంతో 10 మంది మరణించారు. అంతేకాదు ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న మూడు బోట్లను యుఎస్ హెలికాప్టర్లు ముంచేసాయి.
అమెరికాలోని మసాచుసెట్స్ స్టేట్లోని వారి ఇంట్లో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు ,వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా తెలిపింది. భర్త మృతదేహం దగ్గర తుపాకీ దొరికినందున గృహ హింస కారణంగా ఈ సంఘటన సంభవించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
నూతన సంవత్సరం సంబరాలకు దూరంగా ఉండాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిక ప్రధాన కారణం గాజా పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్థాన్ మరోసారి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే గాజా ప్రజలకు సంఘీభావంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
Francoise Bettencourt Meyers: ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ ఇటీవల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఆమె రికార్డు సొంత చేసుకున్నారని బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించారు. 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా ..(Francoise Bettencourt Meyers) బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ”ఎల్’ఓరియల్” షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద […]