Last Updated:

Israeli Strikes: రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 37 మంది పాలస్తీనియన్ల మృతి

గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న కాల్పులు, వైమానిక దాడులతో 37 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది గుడారాలలో ఆశ్రయం పొందారు, రఫా యొక్క పశ్చిమ టెల్ అల్-సుల్తాన్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించారని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపారు.

Israeli Strikes: రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 37 మంది పాలస్తీనియన్ల మృతి

Israeli Strikes: గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న కాల్పులు, వైమానిక దాడులతో 37 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది గుడారాలలో ఆశ్రయం పొందారు, రఫా యొక్క పశ్చిమ టెల్ అల్-సుల్తాన్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించారని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపారు.

గుడారాల్లో 45 మంది మృతిపై ..(Israeli Strikes)

రఫా వెలుపల మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గుడారాల్లో ఉన్న 45 మంది మరణించిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. పలువురు నాయకులు దీనిని ఖండించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషాదకరమైన తప్పిదంగా అభివర్ణించారు.ఇది పౌర ప్రాణనష్టం కలిగించడానికి ఉద్దేశించినది కాదని అన్నారు. ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ఘటనను వర్ణించడానికి విషాదకరమైన పదం సరిపోదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని “మానవతా అంతర్జాతీయ చట్టం యొక్క కొత్త మరియు కఠోరమైన ఉల్లంఘన అని పేర్కొంది. జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని యుద్ధ నేరం అని పేర్కొంది. ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారి దీనిపై మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: