Home / తాజా వార్తలు
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన బండి సంజయ్ పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లెలో బండి సంజయ్కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా సంజయ్ అప్పిరెడ్డిపల్లెలో పైలాన్ ఆవిష్కరించారు.
కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా,
క్యాసినో కేసులో . ప్రధాని నిందితుడు చికోటి ప్రవీణ్ సంచలణ కామెంట్స్ చేశారు. తనను చంపేస్తానంటూ విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. హిట్ మెన్ అనే యాప్లో సుపారి ఇచ్చామని.. త్వరలోనే నీ ప్రాణాలు పోతాయంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్పారు.
గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో నిందితులను విడుదల చేయడంపం మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిని వాళ్లకు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీకి దేశం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ సభ్యుల్లో అత్యధికులు లిజ్ వైపు నిలిచారు. దీంతో రుషి ఆమె కన్నా 32 పాయింట్లు వెనుకబడి ఉన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.