Published On:

Unni Mukundan: అహ్మదాబాద్‌ ఘటన – అక్కడే మేం ఉండేవాళ్లం.. ప్రమాదం తెలిసి షాకయ్యా

Unni Mukundan: అహ్మదాబాద్‌ ఘటన – అక్కడే మేం ఉండేవాళ్లం.. ప్రమాదం తెలిసి షాకయ్యా

Unni Mukundan Reacts in Ahmadabad Flight Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై మాలీవుడ్‌ హీరో ఉన్ని ముకుందన్‌ స్పందించారు. విమాన ప్రమాద ఘటన తెలిసి షాక్‌ గురయ్యాయని, ఆ ప్రాంతంతో తనకు 24 ఏళ్ల అనుబంధం ఉందంటూ ఎమోషనల్‌ అయ్యాడు. తన బాల్యమంత అక్కడే గడిచిందని, తాను నివసించిన ప్రాంతంలో ఘోరమైన విషాదం జరగడం తనని తీవ్రంగా కలిచివేసిందన్నాడు.

 

విమాన ఘటన తెలియగానే తాను, తన స్కూల్‌ ఫ్రెండ్స్‌ అంత షాక్‌కి గురయ్యామని చెప్పుకొచ్చాడు. కాగా కేరళలోని త్రిసూర్‌ జన్మించిన ఉన్ని ముకుందన్‌ చిన్నప్పుడే తన కుటుంబమంత అహ్మదాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యామని చెప్పాడు. “ఒకప్పుడు మా కుటుంబమంత అహ్మదాబాద్‌లో ఉండేది. నా చిన్నతనం మొత్తం మణినగర్‌లోనే గడిచింది. నాకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకు మేమంత అక్కడే ఉన్నాం. నా పాఠశాల విద్య కూడా మొత్తం అక్కడే జరిగింది.

 

ప్రమాదం జరిగిన కొన్ని మైళ్ల దూరంలోనే మేము ఉండేవాళ్లం. మేము నివసించే ప్రాంతం పేరు మణినగర్‌. అక్కడే నా బాల్యం అంత గడిచింది. ప్రమాదం జరిగిన మెఘానగర్‌కు కేవలం కొంత దూరమే. కేరళ మాదిరిగానే గుజరాత్‌ అంటే నాకేంతో ఇష్టం. విమాన ప్రమాదం గురించి తెలిసి నేను, నా స్కూల్‌ ఫ్రెండ్స్‌ షాకయ్యాం. బాధిత కటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయాన్ని వారు ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నాడు.

 

కాగా మలయాళ నటుడైన ఉన్ని ముకుందన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం. అనుష్క భాగమతి చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. సీడన్‌ అనే తమిళ చిత్రంతో ఆరంగేట్రం చేసిన అతడు ఆ తర్వాత మల్లూ సింగ్‌లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత విక్రమాదిత్యన్‌, కెఎల్‌ 10 పట్లు, స్టైల్‌, ఒరు మురై, వంతు పార్థయ, అచాయన్స్‌, మాలికప్పురం, మార్క్‌ వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు.