Last Updated:

Vizianagaram: కుమార్తెను హీరోయిన్ చేయాలని రోజూ ఇంజెక్షన్లు.. బాధ భరించలేక

కన్నకుమార్తెను సినీ రంగంలోకి పంపించాలనే మోజుతో ఓ తల్లి చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ చేయాలనే ఆశతో.. చిన్నారిని త్వరగా పెద్ద దాన్ని చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది.

Vizianagaram: కుమార్తెను హీరోయిన్ చేయాలని రోజూ ఇంజెక్షన్లు..  బాధ భరించలేక

Vizianagaram: కన్నకుమార్తెను సినీ రంగంలోకి పంపించాలనే మోజుతో ఓ తల్లి చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ చేయాలనే ఆశతో.. చిన్నారిని త్వరగా పెద్ద దాన్ని చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. దీంతో ఆ ఇంజెక్షన్ల బాధ భరించలేని చిన్నారి చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ దారుణం విజయనగరంలో జరిగింది.

 

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ మహిళ నివసిస్తోంది. ఆమెకు ఒక కుమార్తె పుట్టిన తర్వాత.. ఆమె మొదటి భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. అతను ఆమెను వదిలేసి పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె ఇంకో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

 

తరచుగా తల్లితో గొడవులు(Vizianagaram)

అయితే మొదటి భర్తకు పుట్టిన బాలిక (15) విశాఖలోని ప్రభుత్వ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు అవడంతో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో తల్లి వద్దకు ఎవరెవరో వస్తుండటాన్ని గమనించిన చిన్నారి.. తల్లి దగ్గర ఉండేందుకు ఇష్టపడలేదు. ఇదే విషయంపై తరచుగా తల్లితో గొడవులు జరుగుతతూ ఉన్నాయి. ఈ మధ్య ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ బాలికను చూశాడు. హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయని, అయితే కొన్ని అవయవాలు బొద్దుగా పెరగాలంటూ నమ్మ బలికాడు.

 

బాధ భరించలేక

అతడి మాటలతో కుమార్తెకు రోజూ ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించడం ప్రారంభించింది. ఈ క్రమంలో చిన్నారి అనారోగ్యం బారిన పడింది. బాధ భరించలేక తల్లిని వేడుకున్నా కనికరించలేదు. దీంతో ఏం చేయాలో తోచక చివరకు గురువారం రాత్రి 1098కు ఫోన్‌ చేసి చైల్డ్‌లైన్‌ సిబ్బందికి తన పరిస్థితిని వివరించింది. వారు వెంటనే అప్రమత్తమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో వెళ్లి బాలికను తమ అధీనంలోకి తీసుకున్నారు అధికారులు. అనంతరం విశాఖపట్నంలో స్వధార్‌ హోమ్‌కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను కోరినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు.