Home / బిజినెస్
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గాను ఇప్పటికే రిటర్న్ పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయపు పన్ను డిపార్ట్ మెంట్ ఇప్పటి వరకూ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆడిట్ అవసరం లేని వారు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
రియల్ మీ నుంచి సరికొత్త సిరీస్ లు దేశీయ మార్కెట్ లో విడుదలయ్యాయి. రియల్ మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G పేరిట ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. కాగా, మే 10 న చైనా మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో నేడు ( జూన్ 9 , 2023 ) తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్పై రూ. 430 వరకు తగ్గింది. బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం
దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఎక్కువగా మహిళలే కంపెనీని వీడుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని టీసీఎస్ వెల్లడించింది. ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని తీసివేయడమే ఇందుకు కారణం కావచ్చని కంపెనీ అభిప్రాయ పడింది.
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ప్రస్తుతం నేడు కూడా ( జూన్ 8, 2023 ) బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథావిధిగా కొనసాగించింది. మానటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ గురువారం వెల్లడించారు.
దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.
వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతీ సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. ఆటో ఎక్స్ పో 2023 లో ఈ వెహికల్ న పరిచయం చేసినప్పటి నుంచి దీని విడుదలపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ ట్రెండ్నే కొనసాగించాయి. రేపు ఆర్బీఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది.
టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ భారీగా లే ఆఫ్స్ విధించినట్టు తెలుస్తోంది. సంస్థలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.