Home / ప్రాంతీయం
దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. అభివృద్దికి మూడు సూత్రాలు మూలమవుతాయిని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన అతి కొద్దికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో
ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?
లేడీ అమితాబ్ విజయ శాంతి పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా, ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ సోదరిగా పిలిపించుకున్నా, అక్కడా కుదురుకోలేకపోయారు.
జగిత్యాల జిల్లాలో సరోగసీ విధానం ద్వారా దూడలకు జన్మనిస్తున్నాయి పాడిపశువులు. ఎల్డీఏ, కోరుట్ల పశువైద్యకళాశాల సంయుక్తంగా చేపట్టిన సరోగసి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కోడెకవల దూడలు జన్మించాయి.
హైదరాబాద్ అంబర్ పేట నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం మంటలతోనే ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకునే యత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది.
కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్లకు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలను నల్లుల్లా నలిపేస్తానని హెచ్చరించారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు.