Home /Author M Rama Swamy
AP Cabinet : ఏపీ ఫైబర్నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను డీమెర్జ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీడీసీ (ఏపీ డ్రోన్ కార్పొరేషన్)ను ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్) నుంచి సపరేట్ చేసి, స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో డ్రోన్ సంబంధిత అంశాలను నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. నేడు వెలగపూడిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. భేటీలో 23 అంశాలపై చర్చించారు. […]
Supreme court : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన […]
High Court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. […]
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన చర్చ ప్రారంభించారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది […]
Bhatti Vikramarka : హెచ్సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై లాఠీఛార్జీ జరగడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడ ఉన్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. […]
IPL 2025 : బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ గిల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతోపాటు బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. దీంతో ఫిల్ స్టాల్(14), కోహ్లీ (7), దేశ్దత్ పడిక్కల్ (4), రజిత్ పాటిదార్ (12)పరుగులకే వెనుదిరిగారు. లివింగ్ స్టోన్ (54) పరుగులు చేసి అదరగొట్టారు. జితేశ్ (33), టిమ్ డేవిడ్ (32) పరుగులు చేశాడు. కెప్టెన్ […]
Cm Chandrababu : తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. భక్తుల కోసం వాట్సప్ సేవలు త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రతి సేవపై భక్తుల ఫీడ్ బ్యాక్ తమకు అందేలా త్వరలో వాట్సాప్ సేవలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇవాళ సచివాలయంలో టీటీడీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100శాతం మార్పు కనిపించాలని పేర్కొన్నారు. […]
Mystery Virus : రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. ఆ దేశ ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధి, దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్ వల్ల దగ్గుతున్న సమయంలో రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వెలువడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వైరస్ […]
Trump tariffs : ఇండియాతోపాటు అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై ప్రకటన చేయనుండగా, వెంటనే అమల్లోకి వస్తాయని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ఏటా భారీస్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా 600 బిలియన్ల నుంచి 700 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేసింది. కొత్త టారిఫ్ల వల్ల ఏటా 600 […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జీటీ) మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీని మొదటగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లో […]