Home /Author M Rama Swamy
Mystery Virus : రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. ఆ దేశ ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధి, దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్ వల్ల దగ్గుతున్న సమయంలో రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వెలువడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వైరస్ […]
Trump tariffs : ఇండియాతోపాటు అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై ప్రకటన చేయనుండగా, వెంటనే అమల్లోకి వస్తాయని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ఏటా భారీస్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా 600 బిలియన్ల నుంచి 700 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేసింది. కొత్త టారిఫ్ల వల్ల ఏటా 600 […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జీటీ) మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీని మొదటగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లో […]
LRS Date Extended : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ పథకం రాయితీ గడువును మరోసారి పెంచింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రాయితీ గడువు మార్చి 31తో ముగియగా, మరోసారి గడువును పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గడువును ఈ నెల 30 వరకు పొడగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 30లోగా ఫీజు చెల్లింపు చేసిన వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ […]
Telangana Congress : గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 మూవీ చూసేందుకు థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో అతడిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి తరలించి వైద్యం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను […]
High court : కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హైకోర్టులో దాఖలు చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న కోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది. జీవో 54 తీసుకొచ్చిన ప్రభుత్వం.. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, […]
AP Legislative Council : ఏపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత నాగబాబు సతీసమేతంగా మండలి చైర్మన్ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఆఫీస్కు వచ్చారు. ఇద్దరు నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. బీజేపీ […]
Supreme Court : పార్టీ మారిన 10 ఎమ్మెల్యే అనర్హతపై ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ధర్మాసనాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా […]
Waqf Bill : కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభలో ప్రసంగించారు. బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తిగా చెబుతారని ఆరోపించారు. విపక్షాలు అసత్య ప్రచారం.. బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని మండిపడ్డారు. బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను మరోసారి తప్పుదోవ […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంమఎర్రవల్లి ఫామ్హౌస్లో జరిగింది. సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ […]