Home /Author M Rama Swamy
Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజులపాటు సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సౌదీ అరేబియా సర్కారు ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ దేశం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15 విమానాలు.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్గా వచ్చాయి. […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. మిగిలిన 6 మంది మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బండ రాళ్లను తొలగించారు. లోకో రైలు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలించారు. మిగిలిన 43 మీటర్లలో తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో మృతదేహాల వెలికితీత నిలిచిపోయింది. కేవలం టన్నెల్లో వాటర్గ్ ప్రక్రియ, మట్టి, స్టిల్ కటింగ్లను బయటికి […]
Pope Francis : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. పోప్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. ప్రక్రియ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నేడు కీలక కార్డినళ్ల సమావేశం జరిగింది. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలైంది. రోమ్లో అందుబాటులో ఉన్న కార్డినళ్లు సమావేశానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో పోప్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ […]
Film Awards : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు వేదిక ఖరారు అయింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఏర్పాట్లకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇస్తున్నది. అవార్డుల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ చైర్మన్గా ప్రముఖ నటి జయసుధతోపాటుగా 15 మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్రాజు, జయసుధ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్లో గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. పట్టికలో మొదటి స్థానంలో గుజరాత్ బ్యాటర్లు తగ్గేదేలే అంటున్నారు. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్నారు. ఈడెన్ మైదానంలో కోల్కతా బౌలర్లను ఓపెనర్లు శుభ్మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52) ఉతికేశారు. తమ జోడీ పవర్ఫుల్ అని చాటుతూ అదిరే అరంభం అందించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ సెంచరీని […]
Namo Bharat train : దేశంలో 16 బోగీలతో మొదటి నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బిహార్లోని జయ్నగర్-పట్నా స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ నడువనున్నదని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలి నమో భారత్ రైలు గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్-భుజ్ స్టేషన్ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రైల్లో 12 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా కోచ్ల […]
TG Inter Results : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ […]
Revanth Reddy : తెలంగాణలో ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి లాంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు మధ్యలోనే తమ జీవితాలను ముగించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని రేవంత్రెడ్డిని రాహుల్ లేఖలో కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా గుజరాత్ జట్టు మంచి జోరు మీద ఉంది. సోమవారం మరో పోరుకు సిద్ధమైంది. భారీ లక్ష్యాలను ఛేదిస్తున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ సేన కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. కోల్కతా ఈడెన్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అజింక్యా రహానే మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముల్లనూర్లో పంజాబ్పై చిత్తు చిత్తుగా కోల్కతా ఓడిపోయింది. ఈ సారి గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. […]
AP SSC Results : ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 23న ఉదయం 10గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పదో విద్యార్థులు ఫలితాలను ap.govt.in/వెబ్సైట్తోపాటు మన మిత్ర వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు […]