Home /Author M Rama Swamy
Kashmir Terror Attack : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2000లో బిల్ క్లింటన్ భారత్లో పర్యటన.. అగ్రరాజ్యం అగ్ర నేత ఇండియాను […]
AP CM Chandrababu Condoles : పహల్గాంలో ఉగ్రదాడిలో ఏపీకి చెందిన చెందిన ఇద్దరు మృతిచెందారు. ఒకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కాగా, మరొకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ ఉన్నారు. వారి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు శక్తిని ఇవ్వాలని ఆ దేవుడిని […]
Student suicide : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబానికి తీరని శోకం మిగుల్చుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విత తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర […]
TDP Leader murder : ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి గురయ్యారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో వీరయ్యపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత […]
IPL 2025 : సొంతగడ్డపై లక్నో జట్టు ఓపెనర్లు అదరగొట్టారు. ఓపెనర్ మర్క్రమ్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మిచెల్ మార్ష్ (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లే తర్వాత పుంజుకున్న ఢిల్లీ పేసర్లు లక్నోను కట్టడి చేశారు. ముకేశ్ కుమార్(4-33) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లక్నో జట్టును దెబ్బతీశాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని (36), డేవిడ్ మిల్లర్ (14 నాటౌట్) డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడారు. ముకేశ్ వేసిన 20వ […]
West Bengal CM Mamata : వక్ఫ్ చట్టం అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో మొదలైన నిరసనలు చివరికి ఉద్రిక్తంగా మారాయి. అల్లర్లపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆమె మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడి కొందరు గూండాలు యువకులను టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమయ్యారని ఆమె ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.. బెంగాల్లో హింస వెనుక […]
IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా మరికాసేపట్లో లక్నో, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో అక్షర్ బృందం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. రిషభ్ పంత్ సేన పేసర్ దుష్మంత్ సమీరకు తుది జట్టులో అవకాశం కల్పించింది. టేబుల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీకి, ఐదో స్థానంలో కొనసాగుతున్న […]
BRS Working President KTR : వికారాబాద్ జిల్లాలోని లగచర్ల బాధితులను కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వారి పేర్లు రాసిపెట్టుకుంటామని తెలిపారు. మరో మూడేండ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతిగా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్డ్ అయి ఎక్కడ ఉన్నా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రజతోత్సవ […]
Andhra Pradesh News : ఈ రోజుల్లో కొందరు స్టూడెంట్స్ పరిస్థితి చూస్తుంటే.. ఇవేం చదువులు అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యార్థులు భయపడేవారు. టీచర్లు అంటే గౌరవం కూడా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్గా ఉంది. ఉపాధ్యాయులపై జోకులు వేయడం వంటివి చేస్తున్నారు. క్లాస్ రూమ్లో విద్యార్థులను టీచర్లు కొడితే.. తల్లిదండ్రులు మా అబ్బాయిని కొడతారా..? మా అమ్మాయిని బెరిస్తారా? అంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలిపై […]
Summer special trains : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఈ నెల 24 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు టూర్లకు వెళ్లనున్నారు. దీంతో ప్రయాణికుల దృష్ట్యా అదనపు రైళ్లను నడుపనున్నది. తాజాగా విశాఖ- తిరుపతి, భువనేశ్వర్-యశ్వంత్పూర్ మధ్య రైళ్లు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖ-తిరుపతి రైలు నంబర్ 08583 […]