Home /Author M Rama Swamy
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]
AP, Telangana Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో గొడుగులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి […]
awan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ సింగపూర్లో ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మార్క్ శంకర్ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్… శనివారం రాత్రి పవన్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. తన […]
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశతో టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 8 మంది ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందన్నారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. […]
IPL 2025 27th Match- SRH Vs PKBS: హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 36 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. నేహల్ వధేరా 27 పరుగులు చేసి రాణించాడు. చివర్లలో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్లతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. […]
Trump tariffs : టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. ఈ మేరకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో యాపిల్, శాంసంగ్ వంటి పెద్దపెద్ద కంపెనీలతో పాటు అమెరికాలోని వినియోగదారులకు భారీ ఊరట లభించి నట్లయ్యింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు.. చైనా మినహా మిగిలిన ఇతర దేశాలపై వేసిన సుంకాలను ఇటీవల ట్రంప్ […]
National Herald Case : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ ప్రకటించింది. ఢిల్లీ, ముంబయి, లక్నోల్లోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని, వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ప్రకటనలో […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో లక్సో జట్టు జోరు కొసాగిస్తోంది. వరుస విజయాలతో పట్టికలో టాపర్గా ఉన్న గుజరాత్కు బిగ్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగిన గుజరాత్ను 180 పరుగులకే కట్టడి లక్నో కట్టడి చేసింది. తర్వాత ఛేదనలో దుమ్మురేపింది. నికోలస్ పూరన్ (61), ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ (58) అర్ధసెంచరీలతో చెలరేగి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా […]
IPL 2025 : ఐపీఎల్ 118వ సీజన్లో పాయింట్ల పట్టిలో అట్టుడుగున ఉంది. తాజాగా హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుతో ఉంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చావోరేవో పోరులో కెప్టెన్ కమిన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాడు. కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. […]
IT Minister Sridhar Babu : అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దుష్ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు మంచి జీవనం అందించాలని ప్రభుత్వం భావించిందన్నారు. మూసీ పరివాహాక ప్రజలకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం ఇవ్వాలని భావించామన్నారు. హైదరాబాద్లో మంచి […]