Home / తెలంగాణ
సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పీసీసీ లంచ్ ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది.
అస్సాం వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్ కోర్ట్ వద్ద ఆగి మోమొలు తిన్నారు. స్ట్రీట్ ఫుడ్ ఎవరు వద్దంటారు అందులోనూ మోమొస్ లాంటి ప్రత్యేకమైన పదార్థాలు తినకుండా ఎలా ఉంటామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ మీద పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో కస్టమర్ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెరుగు అడిగినందుకే దాడి చేస్తారా అంటూ ఆ హోటల్ ను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలోకి చేరేందుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సిద్ధమయ్యాడు. ఈ నెల 12వ తేదీన చికోటి ప్రవీణ్ బీజేపీ కండువా కన్నుకోనున్నాడు. . రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరనున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు నాయడును స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పలు నాటకీయ పరిణామాల మద్య జరిగిన ఈ అరెస్ట్ తర్వాత.. ఆయనను ప్రత్యేక కాన్వాయ్ లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమం లోనే దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తూ
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ నాయకులతో పాటు పలువురు విపక్ష నేతలు ఖండిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస చేసి బస్సు నుంచి కిందకు రాగానే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబును సిట్, సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని విజయవాడకు తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 21నుంచి తెలంగాణ బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయనున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బస్సు యాత్రపై సమీక్ష నిర్వహించారు.
హోంగార్డు రవీందర్ మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తని డిపార్ట్మెంట్ వాళ్ళే తగులబెట్టారని సంధ్య ఆరోపించారు. ఘటనకి సంబంధించిన సిసి ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్ని అన్లాక్ చేసి డేటా డిలిట్ చేశారని అన్నారు.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( డబ్ల్యూడబ్ల్యూఈ ).. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే ఈ షో కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అండర్ టేకర్, రాక్, రోమన్ రేయిండ్, జాన్ సీనా, బతిష్టా, ఎడ్జ్, ట్రిపుల్ హెచ్, బిగ్ షో, గ్రేట్ కాళీ.. ఇలా ఎంతోమంది ఫైటర్లు మణహి పేరుపొందారు.