Home / తాజా వార్తలు
గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది.
తూర్పు కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్లోని రెండు శిబిరాలపై శుక్రవారం జరిగిన రెండు బాంబు దాడుల్లో పిల్లలతో సహా 12 మంది మరణించారు. నార్త్ కివు ప్రావిన్స్ రాజధాని గోమా నగరానికి సమీపంలోని లాక్ వెర్ట్ మరియు ముగుంగాలో నిరాశ్రయులైన ప్రజల కోసం ఏర్పాటు చేసిన రెండు శిబిరాలపై బాంబులు పడ్డాయని యునైటెడ్ నేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్కు మరో లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. పాక్షికంగా అయినా మద్యపాన నిషేధం జరిగిందా అని ప్రశ్నించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్.. దానిని అమలు చేశాకే ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.
ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అచ్చే దిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను 2024 లోకసభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.
ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్కే వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నల్లమల అడవిలోనే ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగులపై 15వందల కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.
మన దేశంలో రాజభవన్లు గవర్నర్ల కామ క్రీడలకు వేదికలుగా మారాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారి ఉదంతం అందరికి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి
మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం అంటే కొందరికి సరదా.. మరి కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ నిబంధనలు అలవొకగా ఉల్లంఘిస్తుంటారు. అయితే దేశంలోని చండీఘడ్ను తీసుకుంటే గత 15 నెలల్లో 18 లక్షల రెడ్ లైట్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు లోయలో పడటంతో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బస్సు పంజాబ్లోని రావల్పిండి ప్రావిన్స్ నుండి హుంజాకు వెళ్తుండగా గిల్గిట్-బాల్టిస్తాన్లోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్కు నేటితో తెరపడింది. ఆయన ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ లోకసభ సీటుకు నామినేషన్ ఫైల్ చేశారు. కాగా నామినేషన్ ఫైల్ చేయడానికి ఆయన వెంట మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు వచ్చారు.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022లో జరిగిన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దండె విఠల్ గెలుపొందారు.